హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో స్థానంలో నిర్మించిన ‘ఓడియన్ మాల్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత మల్టీప్లెక్స్గా ప్రత్యేకత చాటుకుంది. ఇక్కడ టికెట్ చెకింగ్ కోసం ఫేస్ రికగ్నిషన్, రోబోటిక్ సేవలు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ మాల్లో 4కే లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్లు, అంతర్జాతీయ బ్రాండ్ల షోరూమ్లు, విశాలమైన ఫుడ్ కోర్ట్ , గేమింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతం కావడంతో భారీ మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం కల్పించారు.