తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు సేవలందించిన వీసీ సజ్జనార్ ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చిరాగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వీఐపీలకు, డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఎక్స్ట్రా మైల్ రివార్డ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మానవతా దృక్పథంతో పనిచేస్తూ.. ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్న పోలీసులకు ప్రతి శనివారం రివార్డ్ ఇస్తారు.