గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HMDA) బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ఎవరికీ మినహాయింపు లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్లో కొనసాగుతున్న ఈ హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఏపీలోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హైడ్రా భారీ షాక్ ఇచ్చింది. కొండాపూర్లోని సర్వే నంబర్ 79లో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్కు చెందిన ఫామ్ హౌస్ను హైడ్రా అధికారులు శనివారం (ఏప్రిల్ 19) కూల్చివేశారు.