తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్న ఓ బోర్డును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించాలంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును ఏపీకి తరలించాలంటూ కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్రంజన్ సింగ్కు చంద్రబాబు లేఖ రాశారు. అయితే హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు తరలించాలనే దానిపై చంద్రబాబు లెక్కలతో సహా కారణాలు వివరించారు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ చూడాలి మరి.