హైదరాబాద్లో పెరుగుతున్న స్థలాల ధరల దృష్ట్యా.. ప్రభుత్వం 'అఫర్డబుల్ హౌసింగ్' విధానాన్ని ప్రకటించింది. 'తెలంగాణ-2047 విజన్' లో భాగంగా.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పి. శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) , రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ఉన్న 'ప్యూర్' జోన్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆదాయంతో సంబంధం లేకుండా.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) తరహాలో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నూతన కాలనీలను ఏర్పాటు చేయడమే ఈ విధానం లక్ష్యం.