New RTC Buses in Hyderabad: తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ వాసులకు శుభవార్త అందించింది. మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీని తగ్గించేందుకు నేటి నుంచి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో పాటు మరిన్ని బస్సులు త్వరలో రానున్నాయి. 2030 నాటికి హైదరాబాద్లో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కొత్త బస్సుల రాకతో రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.