సికింద్రాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫారం వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కారిడార్ పూర్తయితే ప్రయాణం సులభతరం అవుతుంది.