హైదరాబాద్-విజయవాడ హైవేపై 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. రూ.32 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఈనెల 5న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. నకిరేకల్తో పాటు పరిసర 6 మండలాల ప్రజలకు ఈ ఆస్పత్రి సేవలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా హైవేపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్లోనే అత్యవసర చికిత్స అందించే అవకాశం ఏర్పడనుంది. ట్రామా కేర్, ఐసీయూ, ఆర్థోపెడిక్, ప్రసూతి, నవజాత శిశు వైద్యం, డిజిటల్ ఎక్స్రే, స్కానింగ్, 24 గంటల ల్యాబ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.