హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. హయత్నగర్, భాగ్యలత, పంత్ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ఉన్న అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నప్పటికీ రద్దీ తగ్గడం లేదు.