తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.