బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. పురాతన ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రాకపోకలను నిషేధించాలని ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మెదక్ జిల్లా టెక్మాల్లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.