హైదరాబాద్లో ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ నడుం బిగించింది. నగరంలో ఐదు అత్యాధునిక ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఆహార భద్రతా విభాగాన్ని విస్తరించి, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రజలకు త్వరగా ఫలితాలు అందుతాయి.