హైవే మీద వెళ్తున్నారా.. చిన్న క్లిక్‌తో రూ.1000 మీదే.. ఆఫర్ ముగుస్తోంది..

4 months ago 10
టోల్‌ప్లాజాల వద్ద టాయిలెట్ల పరిశుభ్రత కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఓ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. టోల్‌ప్లాజాల వద్ద టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, తమకు తెలియజేస్తే రూ.1000 రివార్డు పాయింట్లు ఇస్తోంది. ఎవరైనా వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే.. వెంటనే వాటి ఫోటో తీసి, రాజ్ మార్గ్ యాప్‌లో అప్ లోడ్ చేసిన వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో రూ.1000 రీఛార్జ్ జమ చేస్తోంది. అయితే ఇందుకు అక్టోబర్ 31వ తేదీ వరకూ మాత్రమే గడువు ఉంది.
Read Entire Article