అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని దుర్గానగర్ కాలనీ వాసులు నిత్యం భయంభయంగా గడుపుతున్నారు. నిత్యం బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గడిచిన ఆరు నెలలుగా దుర్గానగర్ కాలనీ వాసులకు ఈ ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్లు బండరాళ్లు పగలగొట్టేందుకు బాంబులు ఉపయోగిస్తూ ఉండటం.. ఆ పని ప్రదేశం, దుర్గానగర్ కాలనీకి సమీపంలో ఉండటంతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. బాంబుల శబ్ధానికి ఇళ్లు కూడా బీటలు వారుతున్నాయని వాపోతున్నారు.