తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం నిధుల సమీకరణకు కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డు ఆధీనంలోని వివాదరహిత ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను ఇందిరమ్మ పథకానికి వినియోగిస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ పథకం మొదటి దశ గృహ ప్రవేశాలు జరగనున్నాయి.