హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం (డిసెంబర్ 15) విగ్రహావిష్కరణ ఉన్నందున నిరసన తెలియజేస్తామని తెలంగాణ ఉద్యమకారులు చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ముఖ్యమంత్రికి బదులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివాదంపై బాలు చెల్లెలు ఎస్పీ శైలజ స్పందించారు.