తెలంగాణను కాలుష్య రహితంగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం రెట్రోఫిట్మెంట్ పాలసీని రూపొందిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 1.26 లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం 2026-27 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించి, ఆటో డ్రైవర్లకు 100 శాతం సబ్సిడీ అందించనుంది. దీనివల్ల వాయు, శబ్ద కాలుష్యం తగ్గడమే కాకుండా డ్రైవర్ల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి.