తెలంగాణలో పోడు భూములకు సాగునీటి కోసం ప్రారంభించిన 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకం యూనిట్ వ్యయం పెరుగుతోంది. మొదట రూ.6 లక్షలు అంచనా వేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కువ ఖర్చవుతుందని అధికారులు భావిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో 6 లక్షల ఎకరాలకు సోలార్ పంపుసెట్ల ద్వారా నీటి వసతి కల్పించడానికి రూ.12,600 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.