ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలోని పలు జిల్లాలలో మరికొన్ని గంటలలో పిడుగులతో కూడిన వానలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ద్రోణి ప్రభావంతో మంగళవారం రోజున ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.