1000కి పైగా ఇందిరమ్మ ఇళ్లు రద్దు.. మీరు కూడా ఇలాంటి పని చేశారో ఇక అంతే

7 months ago 16
రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించింది. అయితే చాలా మంది లబ్ధిదారులు నెలలు గడుస్తున్నా సరే ఇంకా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. ఈక్రమంలో కరీంనగర్ జిల్లాలో నిర్మాణం చేపట్టని 1017కు పైగా ఇళ్లను అధికారులు రద్దు చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article