విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. మరో రెండు రోజులలో కుంభాభిషేకం మొదలు కానుంది. మార్చి ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూడు రోజుల పాటు కుంభాభిషేకం క్రతువు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు దుర్గగుడి అధికారులు కీలక విజ్ఞప్తి చేశారు. కుంభాభిషేకం సందర్భంగా యాగశాలలోకి భక్తులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆలయానికి వచ్చి దర్శనాలు చేసుకోవచ్చని సూచించారు.