తెలంగాణలో ఖాళీగా ఉన్న 15 వేల అంగన్వాడీ టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహబూబాబాద్లో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ప్రారంభించి, అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులోనూ వారికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 37 వేల మందికి స్మార్ట్ఫోన్లు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.