"నలుగురు కొడుకులు నీకేంటయ్యా.. కాలు మీద కాలేసుకుని రాజుల బతికేయొచ్చు. ఒక కొడుకు కాకపోయే ఇంకొకడు చూస్తాడు. పైగా 16 ఎకరాలు సంపాధించావు. అది కాస్త సమానంగా అందరికీ పంచిచ్చేశావు. ఇంకేంటీ.. చచ్చేదాకా నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు." అని అందరూ అన్నారు. కానీ.. ఆ విశ్రాత ఉపాధ్యాయుడు 89 ఏళ్ల వయసులో.. పింఛన్ కోసం పీక్కతింటున్న తన కొడుకుల నుంచి రక్షణ కల్పించాలంటూ.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.