ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత తొలిసారిగా సోమవారం రోజున మంగళగిరి వచ్చారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. అలాగే వైద్యుల సూచన మేరకు మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎంవో అధికారులను పవన్ ఆదేశించారు.