ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఎంఎన్జే ఆస్పత్రిలో నెలకు 1,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించనుంది. 10 ప్రాంతీయ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో కీమోథెరపీ, మొబైల్ స్క్రీనింగ్ వాహనాల ద్వారా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమం అమలలు చేయనున్నారు.