మార్చి మొదటి వారం నుంచే రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడి భగభగలు అల్లాడిస్తున్నాయి. వేసవి సెలవులకు ముందు స్కూళ్లలో ఒంటి పూట తరగతులు నిర్వహించడం సాధారణం. అయితే, గతేడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సింగిల్ సెషన్, వేసవి సెలవులను అమలు చేసింది. ఈ సంవత్సరం కూడా సింగిల్ సెషన్స్ అమలు చేయనున్నట్టు తెలిపింది. ఇవి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని, తర్వాత సెలవులు ప్రకటిస్తామని తెలిపింది.