కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో అటవీ శాఖ అధికారులతో పాటుగా దేవస్థానం అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులకు కీలక సూచనలు చేశారు. మెట్ల మార్గంలో, ఘాట్ రోడ్డులో ఒంటరిగా తిరగవద్దని.. వాహనాలను ఘాట్ రోడ్డులో నిలపవద్దని కోరారు. కొండపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పారు. మరోవైపు పులిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు హనుమాన్ బృందాలను రంగంలోకి దింపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.