తెలంగాణలోని నిరుద్యోగుల కొరకు కరీంనగర్ జిల్లాలో కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థ ఉద్యోగ మేళా నిర్వహిస్తోంది. మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తి చేసి, 19 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న యువత అర్హులు. ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు 20,000 రూపాయల వరకు వేతనం అందుతుంది. ఈ కార్యక్రమం 18-11-2025 (మంగళవారం) రోజున కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద గల కళ్యాణ్ జ్యువెలరీ షోరూంలో ఉదయం 11 గంటలకు జరుగుతుంది.