1995 సీఎం చంద్రబాబు ఈజ్ బ్యాక్.. స్టేజ్ మీదే ఆర్డీవోకు మాస్ వార్నింగ్..

5 months ago 26
సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డోన్ ఆర్డీఓ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఆయనకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, తాను గనుక లోతుగా వెళ్లి విచారణ జరిపితే, ఆ పరిణామాలు ఆర్డీఓకు ప్రమాదకరంగా మారుతాయని గట్టిగా హెచ్చరించారు. పాలనలో పారదర్శకత, బాధ్యత ఉండాలని, ప్రజల సమస్యలపై స్పందించని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా డోన్ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రైతు తన భూమి సమస్యను గురించి చంద్రబాబుకు గోడు వెళ్లబోసుకోగా.. చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.
Read Entire Article