తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం దిగుబడి దేశంలోనే ఆల్టైం రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 148 లక్షల మెట్రిక్ టన్నుల భారీ దిగుబడితో చరిత్ర సృష్టించిన తెలంగాణ.. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమైందన్నారు. సన్నాలకు బోనస్తో పాటు రైతులకు హామీ ఇచ్చినట్లుగా మద్దతు ధర నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.