Mamnoor Airport: ఇరవై ఏళ్లుగా వరంగల్ ప్రజలు ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించింది. విమానాశ్రయం నిర్వహణలో అత్యంత కీలకమైన భూసేకరణ పూర్తి కావడంతో.. రానున్న రెండేళ్లలో విమానాశ్రయం సిద్ధమయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ భూమిని కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.295 కోట్లు చెల్లించింది.