రాజాం మున్సిపాలిటీకి త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని మంత్రి నారాయణ ప్రకటించడంతో రాజాం మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. కోర్టు సమస్యలు, గ్రామాల విలీనం కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.