ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా 20 వేల ఎకరాల్లో గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలను కలిపి 20 వేల ఎకరాల్లో గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని 120 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.