మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 సార్లు ఫోన్ చేసినా.. పట్టించుకోలేదని, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తమ జాతి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తాను ప్రయత్నాలు చేస్తున్నానని.. కానీ ఆ అవకాశం తనకు రావడం లేదని తెలిపారు.