సేనతో జనసేనాని కార్యక్రమంలో భాగంగా జనసేన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారానే.. కష్టాలు ఎలా ఉంటాయి అనేది.. దేవుడు భగవంతుడు తనకు చూపించాడని పేర్కొన్నారు. 21 ఏళ్లకే తనకు రాజకీయ ఆలోచనలు వచ్చి.. కమ్యూనిజం చదవడం మొదలుపెట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.