వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు, అనుకరణ వివాదాస్పదమైంది. కిరాక్ ఆర్పీ తీరుపై వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత నాగ మల్లేశ్వరి.. కిరాక్ ఆర్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే 2029 తర్వాత వైసీపీ కార్యకర్తలు తొక్కిపట్టి నార తీస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.