pawan kalyan visited markapuram: వైసీపీ నాయకుల హెచ్చరికలకు పవన్ కళ్యాణ్ గట్టిగా బదులిచ్చారు. రౌడీయిజానికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి సమష్టిగా పనిచేస్తుందని, ఆర్థిక పునర్నిర్మాణానికి చంద్రబాబు అనుభవం అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు.