సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఇక 2034 తర్వాత వేరే వాళ్లకి అవకాశం ఇచ్చి.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి.. ఆయన తర్వాతి స్థానంలో జాతీయ రాజకీయాల్లో తాను కొనసాగుతానని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.