25 ఏళ్లుగా కడుపులోనే పావలా కాయిన్.. యువతి ఎక్సర్​సైజ్​ చేస్తుండగా..!

8 months ago 15
హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. మూడేళ్ల వయసులో పావలా కాయిన్‌ను మింగిన 28 ఏళ్ల యువతికి.. 25 ఏళ్ల తర్వాత కడుపునొప్పితో రావడంతో ఆపరేషన్ చేశారు. పావలా కాయిన్‌తో పాటు ఓ స్టోన్‌ను సైతం డాక్టర్లు బయటకు తీశారు. పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతూ.. వ్యాయామం చేస్తుండగా కాయిన్ పేగులపై ఒత్తిడి చేయడంతో నొప్పి వచ్చిందని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ కేసు అరుదైనదని.. ప్రస్తుతం యువతి కోలుకుంటుందని వైద్యులు తెలిపారు.
Read Entire Article