తెలంగాణవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, అపార్ట్మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువను సుమారు 50 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నెల 28 నుంచి కొత్త ధరలను అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.1500 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఐటీ కారిడార్లు, కమర్షియల్ జోన్లలో ఈ పెంపు ఉండనుంది.