3 రోజులు చిత్రహింసలు పెట్టి హిడ్మా 'హత్య'.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

6 months ago 19
మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. విజయవాడలో వైద్యం కోసం వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి.. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, మారేడుమిల్లిలో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించింది. ఇది కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన హత్య అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యలకు మావోయిస్టు పార్టీ అగ్రనేత దేన్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది.
Read Entire Article