ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హోం మంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక చర్చ సందర్భంగా భవన నిర్మాణ అనుమతులను 30 రోజుల్లోనే మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే నిబంధనలు పాటించని భవన ప్రాంగణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై విధించే జరిమానాలను భారీగా పెంచనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.