30 సెంట్ల భూమి కోసం.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన కొడుకు..

10 months ago 19
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 30 సెంట్ల స్థలం కోసం కన్నవాళ్లను దారుణంగా హత్యచేశాడో కొడుకు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడుపూరి కల్లాలు గ్రామంలో చోటుచేసుకుంది. సోదరికి భూమిని రాసివ్వాలన్న తల్లిదండ్రుల ప్రతిపాదనకు కొడుకు రాజశేఖర్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే గొడవలు జరగ్గా.. శనివారం ట్రాక్టర్‌తో తొక్కించి తల్లిదండ్రులను హత్య చేశాడు. ఫ్రస్తుతం రాజశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Entire Article