విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 30 సెంట్ల స్థలం కోసం కన్నవాళ్లను దారుణంగా హత్యచేశాడో కొడుకు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తల్లిదండ్రులను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడుపూరి కల్లాలు గ్రామంలో చోటుచేసుకుంది. సోదరికి భూమిని రాసివ్వాలన్న తల్లిదండ్రుల ప్రతిపాదనకు కొడుకు రాజశేఖర్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే గొడవలు జరగ్గా.. శనివారం ట్రాక్టర్తో తొక్కించి తల్లిదండ్రులను హత్య చేశాడు. ఫ్రస్తుతం రాజశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.