32 ఎకరాల ల్యాండ్ వివాదం.. ఎస్ఐ వేధింపులపై హైకోర్టును ఆశ్రయించిన టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి..

1 year ago 21
టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి తన వ్యవసాయ భూమి విషయంలో ఎస్ఐ వేధింపులను ఆశ్రయిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లాలో 32 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ఎస్ఐ రామ్మూర్తి జోక్యం చేసుకుని తమను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎస్ఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5న జరగనుంది.
Read Entire Article