నాగార్జునసాగర్లో నిర్వహించిన మహా వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీత హాజరైన విషయం తెలిసిందే. అనంతరం సీఎం దంపతులు నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించారు. కాగా, నాగార్జునసాగర్తో రేవంత్–గీత దంపతులకు ప్రత్యేక అనుబంధం ఉంది. వారి తొలి పరిచయం ఇక్కడే ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వారు ఒక్కటయ్యారు.34 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలో రేవంత్-గీత కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.