Mulumudi Kaluju Bridge 40 Years Problem Resolved: టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 40 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎట్టకేలకు ములుమూడిలో కలుజుపై బ్రిడ్జిని నిర్మించి ప్రారంభించారు. కేవలం ఆరు నెలల్లోనే మొత్తం పూర్తి చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం తర్వాత మార్చి నెలలో శంకుస్థాపన చేయగా.. ఆదివారం రోజు కలెక్టర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే సమక్షంలో ప్రారంభించారు.