తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామానికి చెందిన నాయిని మనోహర్ రెడ్డి 40 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. వయసు పైబడటంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నాక, గ్రామంలో శాంతిభద్రతలకు ఆయన అందించిన సేవలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.