ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజున అత్యధికంగా మన్యం జిల్లా సాలూరులో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు శనివారం రోజున 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కువ మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని తెలిపింది.