Vasantha Krishna Prasad On Mylavaram Road: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. మైలవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారి అభివృద్ధి పనుల టెండర్లను 48 గంటల్లో పిలవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఈ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. నిధులు మంజూరైనా అధికారులు టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.