Amaravati Relaunch Event By PM Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నవశకం ఆరంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రూ.1.07 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వెలగపూడిలో 'అమరావతి పునఃప్రారంభం' పేరుతో భారీ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.